పోలీస్ స్టేషన్‌‌లో ఎస్‌ఐ ముందే..

by  |
పోలీస్ స్టేషన్‌‌లో ఎస్‌ఐ ముందే..
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేసు విషయంలో పోలీసులు విచారిస్తుండగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని తెనాలి త్రీటౌన్ పోలీస్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది వివరాళ్లోకి వెళితే… స్థానిక కోపల్లె గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి చెంచుపేటకు చెందిన రమాదేవి అనే మహిళతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే చీటీ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో రమాదేవి గోపిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు గోపీని పోలీస్టేషన్‌కు పిలిపించి విచారిస్తుండగానే, తనతో పాటు తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed