మర్మాంగాన్ని కోసేసి.. 100 కి ఫోన్ చేసి.. ఏం చెప్పాడంటే..?

by  |
crime in badradri kottagudem
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక చిన్న గొడవ ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశంలో ఆ వ్యక్తి చేసిన పని మరో వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు అమ్ముతుంటాడు. ఐదు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం వలస వెళ్లిన కార్తీక్ అక్కడ పాడుబడ్డ భవనంలో ఉంటూ చిల్లర సామాన్లు విక్రయిస్తున్నాడు. ఇక అదే ప్రాంతానికి చెందిన హుస్సేన్ పాషా అనే కూలీ మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కార్తీక్ ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఘర్షణ ఇంకా పెరుగుతుండడంతో కోపోద్రేకుడైన కార్తీక్ తన దగ్గర ఉన్న కత్తితో హుస్సేన్ పాషా చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పొలుసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ పాషా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ ని అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed