గోదావరిలో దూకిన యువకుడు

by  |
suicide
X

దిశ.గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని గోదావరి బ్రిడ్జి పై నుంచి అర్ధరాత్రి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. శివాజీ నగర్‌కు చెందిన తిప్పారపు సుదర్శన్ (37)లు తన స్నేహితుడితో కలిసి గోదావరి బ్రిడ్జి పైకి వచ్చి 12 గంటల సమయంలో ఒక్కసారిగా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఘటనా స్థలం వద్ద రామగుండం ఎమ్మార్‌ఓ తో పాటు 8వ కాలనీ సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed