- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే తన భూమిని కబ్జా చేశారని.. ఎలాగైనా తన భూమిని రక్షించుకోవాలని అధికారులు, మంత్రుల క్యాంపు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మాదాసి లక్ష్మయ్య అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. తన భూమిని బొమ్మకల్కు చెందిన మాజీ వార్డ్ మెంబర్తో పాటు రేకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధి కలిసి కబ్జాకు పాల్పడ్డారంటూ మాదాసి లక్ష్మయ్య ఆరోపించారు. గతంలో ఇదే విషయంపై మంత్రి గంగుల క్యాంపు కార్యాలయం ముందు లక్ష్మయ్య పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ కబ్జాలో విషయంలో కరీంనగర్కు చెందిన మాజీ కార్పోరేటర్ కట్ల సతీష్ హస్తం ఉన్నట్లు బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లక్ష్మయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు బొమ్మకల్ చేరుకొని.. సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో లక్ష్మయ్య టవర్ నుంచి కిందకు దిగాడు.