పెండ్లి చేసుకోలేదని పురుగుల మందు తాగిన ఒంటరి మహిళ

by  |
పెండ్లి చేసుకోలేదని పురుగుల మందు తాగిన ఒంటరి మహిళ
X

దిశ, తుంగతుర్తి: పెళ్లి చేసుకుంటానని నమ్మంచి.. చివరికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని అలుగునూరు గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. అలుగునూర్ గ్రామానికి చెందిన మద్ది కోటమ్మ ఒంటరి మహిళ. 10 సంవత్సరాల క్రితం భర్త చనిపోగా.. అదే గ్రామంలో తన తల్లి గారి ఇంటి వద్దనే కాలం వెల్లదీస్తున్నది. ఇదే సమయంలో అలుగునూర్‌ గ్రామానికి చెందిన మండవ ఉపేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి హద్దులు దాటింది. ఇదే క్రమంలో ఉపేందర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరి నిమిషంలో పెండ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోటమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని నూతనకల్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.


Next Story

Most Viewed