- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో 11వ తేదీ జూన్ రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఓ నేత రికార్డు డ్యాన్స్ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి పిల్లి మొగులయ్య అనే ఓ పార్టీకి చెందిన నాయకుడు గ్రామంలో అర్థనగ్న డాన్స్ లతో, డీజే లతో హోరెత్తించారు. ఈ విషయం గురించి తెలిసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించారు. సాయంత్రం 6 దాటితే చాలు రోడ్డు మీదకు ఒక్క వ్యక్తిని రానివ్వని పోలీసులు వందల మంది కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి నేతపై చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసు అధికారుల తీరుపై పలువురు విమర్శిస్తున్నారు.
Next Story