- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెన్నై: తమిళనాడు బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మరో పది మంది గాయపడ్డట్లు కలెక్టర్ పీఎన్ శ్రీధర్ వెల్లడించారు. కల్లకురిచి జిల్లా శంకరపురంలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టపాసుల దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. మరోవైపు శంకరాపురం–కల్లకురచి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనూ శివకాశీలో జరిగిన ప్రమాదం ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.