శోభనం గదిలో వరుడుకు షాకిచ్చిన వధువు.. ఉక్కబోస్తుందని డాబా మీదకు వెళ్లి

by  |
శోభనం గదిలో వరుడుకు షాకిచ్చిన వధువు.. ఉక్కబోస్తుందని డాబా మీదకు వెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: అతడికి 35 ఏళ్లు.. కానీ ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ఎన్నో సంబంధాలు చూశాడు..కానీ ఏ అమ్మాయి అతగాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలని ఒక మధ్యవర్తిని కలిసి పెళ్లి చేయమని అడిగాడు. ఇక అమాయకుడు దొరికాడని.. ఆ మధ్యవర్తి ఆతగాడితో ఒక ఆట ఆడుకున్నాడు. పెళ్లి పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి, అతని నుంచి లక్ష రూపాయలు కాజేసి పరారైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బింద్ ప్రాంతానికి చెందిన సోనూ జైన్‌కు 30 ఏళ్లు దాటినా పెళ్లి మాత్రం కావడం లేదు. ఎంతమంది అమ్మాయిలు చూసినా ఒకటికి కూడా అతను నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే సోనుకు ఉదల్ కతిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సోనుకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. పెళ్లి అయినా తరవాత లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎలాగైనా పెళ్లి అయితే చాలు అనుకున్న సోను అతడు చెప్పిన ఒప్పందానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే జూలై 26న ఉదల్ కతిక్ ఒక కుటుంబాన్ని సోను ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు.

అన్నీ మాట్లాడుకున్నాక బంధువులందరి సమక్షంలో వారి పెళ్లి జరిగింది. అనంతరం పెళ్లి చేసిన ఉదల్ కతిక్ కు సొన్ 90 వేలు ఇచ్చాడు. దీంతో అతను అక్కడి నుంచి జారుకున్నాడు. ఇక పెళ్లి ఘట్టం ముగిసాక తొలిరాత్రి కోసం ఎదురుచూస్తున్న వరుడికి, వధువు షాక్ ఇచ్చింది. శోభనం గదిలో ఉక్కపోస్తుంది .. అలా డాబా మీదకు వెళ్లి వస్తాననిచెప్పి వెళ్లిన వధువు మళ్లీ వెనక్కి రాలేదు. ఆమెతో పాటు వచ్చిన బంధువులు సైతం హఠాత్తుగా మాయమైపోయారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. డబ్బుకోసం తనని మోసం చేసి పెళ్లి పేరుతో డ్రామాలు ఆడారని వరుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed