సిద్దిపేట జిల్లా ప్రమాదంలో దంపతులు దుర్మరణం

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం దుబ్బాక మండలం పోతిరెడ్డిపేట వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే దంపతులు దుర్మరణం చెందారు. మృతులను నిజాంపేట మండలం చల్మెడకు చెందిన మల్లేశం, ఎల్లవ్వగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed