సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం

by  |
సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
X

దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మలనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నిర్మలనగర్‌కు చెందిన వినయ్‌ అనే బాలుడిని దుండగులు కిడ్నాప్‌ చేశారు. వినయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే వినయ్‎ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed