ఈతకు వెళ్లి బాలుడి మృతి

by Shyam |   (  Updated:2020-04-24 08:04:50  IST  )

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో విషాదం నెలకొంది. శుక్రవారం కృష్ణాపూర్ గ్రామం వద్ద ఉన్న పెద్ద చెరువులో మునిగి అరుణ్ ( 15 ) అనే విద్యార్థి మృతిచెందాడు. ఖానాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఎస్సై వెంకట్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పిల్లల పట్ల [&hellip;]</p>

ఈతకు వెళ్లి బాలుడి మృతి
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో విషాదం నెలకొంది. శుక్రవారం కృష్ణాపూర్ గ్రామం వద్ద ఉన్న పెద్ద చెరువులో మునిగి అరుణ్ ( 15 ) అనే విద్యార్థి మృతిచెందాడు. ఖానాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఎస్సై వెంకట్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.

Tags: boy died, pond, Kalher, sangareddy

Next Story