మియాపూర్‌లో విషాదం.. దారుణానికి ఒడిగట్టిన ఇంజనీరింగ్ విద్యార్థి

by  |
Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై అతి వేగంతో వచ్చిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి.. ఆమెను ఢీకొట్టాడు. దీంతో వెంటనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఈ ప్రమాదంలో ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చిక్సిత పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. శిశువు మృతి చెందడంతో మహిళ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed