హోటల్ గదిలో బంధించి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ఎస్కేప్‌ అయ్యే ప్రతీసారి పట్టుకుని..!

by  |
హోటల్ గదిలో బంధించి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ఎస్కేప్‌ అయ్యే ప్రతీసారి పట్టుకుని..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వెంటపడి వేధించడమే కాకుండా తన కామ కోరికలు తీర్చుకునేందుకు వారిని కిడ్నాపులకు సైతం పాల్పడుతున్నారు. ఆ తర్వాత అత్యాచారం చేయడమే కాకుండా కొన్ని సార్లు ఏకంగా బాధిత మహిళలు, యువతులు, చిన్నారులను మట్టుబెడుతున్నారు. నిర్భయ చట్టం వచ్చినా కూడా దేశంలో లైంగిక వేధింపులు ఏ మాత్రం తగ్గలేదు కదా.. రెట్టింపయ్యాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. లోపం ఎక్కడ ఉందని సవరించుకునేలోపే మరోవైపు మహిళలు, యువతుల జీవితాలు తెల్లారుతున్నాయి. తాజాగా ఓ యువతిని బంధీ చేసి మరీ హోటల్ గదిలో మూడ్రోజులు దారుణంగా గ్యాంప్ రేప్ చేశారు. ఈ దారుణమైన ఘటన యూపీ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకివెళితే.. 24 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా హోట‌ల్‌కు తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళాక ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె తేరుకున్నాక అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతీసారి పట్టుకుని బంధించి మళ్లీ మళ్లీ రేప్ చేశారు. ఇలా మూడ్రోజులు బాధిత యువతిని కొడుతూ, చిత్రహింసలు పెట్టారు. చివరకు అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బాధితురాలిని హోటల్ తీసుకువెళ్లిన వ్యక్తిని రాహుల్ వర్మగా గుర్తించారు. అతనికి, బాధితురాలికి ముందుగానే పరిచయం ఉందని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితుడు, అతని స్నేహితులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది.



Next Story