ధర్మపురిలో 23 ఏళ్ల యువతి కిడ్నాప్ కలకలం

by  |
ధర్మపురిలో 23 ఏళ్ల యువతి కిడ్నాప్ కలకలం
X

దిశ, ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన 23 ఏళ్ల యువతి అద‌ృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు కారు లో వచ్చి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. యువతి తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. యువతికి ఇటీవల వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు. కాగా, ఇదే యువతిని రెచ్చపెళ్ళి గ్రామానికి చెందిన రాజేందర్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

దీనికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం యువతికి పెళ్లి కుదరడంతో విషయం తెలుసుకున్న రాజేందర్ స్నేహితులతో కలిసి కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అయితే, మార్గం మధ్యలో కారు ఆగిపోవడంతో కిడ్నాపర్లు కారును అక్కడే విడిచి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రాజేందర్ కోసం గాలిస్తున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు.



Next Story

Most Viewed