- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ATGM: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది?

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం ఫిరంగులు, భారీ మెషిన్ గన్స్ తో షెల్లింగ్ చేస్తోంది. పాక్ సైనికులు ప్రత్యేకంగా బంకర్లు నిర్మించుకున్నారు. అయితే, పాక్ కుట్రను తిప్పికొట్టేందుకు భారత్ ప్రత్యేకంగా యాంటా ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ని వాడుతోంది. అయితే, అసలు ఈ మిస్సైల్ ఏంటంటే?.. భారీగా సాయుధ వాహనాలు, ట్యాంకులను నాశనం చేసేందుకు రూపొందించిన ఆయుధ వ్యవస్థే ఈ ఏటీజీఎం. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ను లాక్ చేస్తే.. దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజం పైనుంచి లేదా.. ట్రైపోడ్, వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి కచ్చితత్వంతో సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం.
పని చేసే విధానం ఇదే..
అయితే, షేప్డ్ ఛార్జి అనే పేలు పదార్థాన్ని ఏటీజీఎంలలో వాడుతారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో సాయుధా వాహనాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక ఏటీజీఎంల్లో రెండుసార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్హెడ్లను వాడుతారు. తొలి పేలుడుకు ట్యాంక్కు బయట ఉన్న కవచం ధ్వంసం అవుతుంది. ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు వాడే క్షిపణుల వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారుచేస్తారు. ఇలాంటివాటిని తట్టుకొని ట్యాంక్ను నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారుచేస్తారు. తొలి పేలుడుకు సాయుధ కవచం, రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయటమే వీటి లక్ష్యం. అంతేకాకుండా అన్ని రకాల పరిస్థితుల్లో పగలు, రాత్రి ఇలా ఏ సమయంలోనైనా పనిచేసేలా వీటిని తయారుచేశారు. వీటిల్లో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. వీటిని ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకు ఎగిరి.. ట్యాంక్ టాప్పై పడుతుంది. దీనిలో డ్యూయల్ మోడ్ సీకర్ అనే ఆప్షన్ ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి.. దానిని అనుసరించేలా చేస్తుంది.
ఏటీజీఎంను ఎలా ఆపగలరంటే?
కొన్ని ట్యాంకులు రీయాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతాయి. వీటిపై కొన్నిరకాల ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ఏటీజీఎం తాకగానే బయటవైపునకు మాత్రమే పేలుడు జరుగుతుంది. మరికొన్ని దేశాలు లోహపు పంజరం వంటి వాటిని ట్యాంకులపై అమరుస్తున్నాయి. ఏటీజీఎం వీటిని తాకి ముందే పేలిపోతాయి. ఇక క్షిపణుల సిగ్నల్స్ను జామ్ చేసే వ్యవస్థలు వాడటం.. లేదా డికాయ్లను ప్రయోగించి మిస్సైల్ ని గందరగోళానికి గురిచేయవచ్చు. ఇజ్రయెల్ వద్ద ట్రోఫీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అవి ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుంది. ఈ వ్యవస్థలు చాలా తేలిగ్గా.. వేగంగా.. స్మార్ట్గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ఏటీజీఎంలను వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ కూడా వాటిని వాడుతోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ పై పాక్ మిస్సైల్స్,డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే, పాక్ వాడిన ఆ 50 డ్రోన్లను ఈ ఏటీజీఎంలను వాడే భారతసైన్యం కూల్చివేసింది.