- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశ సాయుధ దళాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం: విరాట్ కోహ్లీ

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మన ఆర్మీ దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పాకిస్తాన్ భారత్ పై దాడి చేయగా భారత రక్షణ వ్యవస్థ ఆ దాడులను నిలవరించడమే కాకుండా.. దీటైన సమాధానం ఇచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్ర తరం అయింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడంపై సమీక్షించిన బీసీసీఐ ఐపీఎల్ 2025 ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భారత క్రికేటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో "ఈ క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని తీవ్రంగా రక్షించినందుకు మన సాయుధ దళాలకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాను. అలాగే వారికి వందనం చేస్తున్నాను. మన వీరుల అచంచల ధైర్యసాహసాలకు, మన గొప్ప దేశం కోసం, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. జై హింద్.." అని విరాట్ కోహ్లీ రాసుకొచ్చారు.