యుద్ధం పరిష్కారం కాదు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక తీర్మానం

by Ramesh N |
యుద్ధం పరిష్కారం కాదు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక తీర్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాకిస్తాన్ (India-Pakistan border) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (All India Muslim Personal Law Board) శాంతి కోసం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా ఆఫీస్ బేరర్లు ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి కీలక తీర్మానాలు ఆమోదించారు. దేశం ప్రజల రక్షణ కోసం అందుకు తీసుకునే ప్రతి అవసరమైన చర్యకు బోర్డు మద్దతు ఉంటుందని, క్లిష్టమైన సమయాల్లో, ప్రజలు, రాజకీయ పార్టీలు, సాయుధ దళాలు, ప్రభుత్వం ఈ ముప్పులను ఎదుర్కోవడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇస్లామిక్ బోధనలలో ఉగ్రవాదానికి ఎటువంటి స్థానం లేదని తెలిపారు. దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ విషయాలను పరిష్కరించుకోవాలని తెలిపారు. యుద్ధం అనేది సమస్యకు పరిష్కారం కాదన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్తాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు.

ఇక, ముస్లిం పర్సనల్ లా బోర్డు యథావిధిగా తన సేవ్ వక్ఫ్ ప్రచారాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, దాని బహిరంగ సమావేశాలు మరియు కార్యక్రమాలు వచ్చే వారం (మే 16 వరకు) వాయిదా వేసినట్లు ప్రకటించారు. తోటి పౌరులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, మతాంతర సంభాషణలు, మసీదులలో ప్రసంగాలు, జిల్లా న్యాయాధికారులు, కలెక్టర్ల ద్వారా మెమోరాండమ్‌ల సమర్పణ, పత్రికా సమావేశాలు వంటి ఇండోర్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తీర్మానించారు.



Next Story

Most Viewed