- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్.. అసలు విషయం ఇదే!

దిశ, వెబ్డెస్క్: భారత్ చేపట్టిన వరుస దాడులతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. ఈ క్రమంలోనే భారత్పై ఎలాగైనా కక్ష తీర్చువాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, డ్రోన్లలో దాయాది పాక్ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థికి మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ స్పీడ్ను పెంచింది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది. పాకిస్థాన్ భూభాగంలోనిలోని ప్రధాన నగరాలు, ఎయిర్బేస్లపై దాడులు చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాక్ ఏకంగా తన ఎయిర్ స్పేస్ను మూసేసింది.
ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేశారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా చూసుకోవాలని అన్నారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాక్ మధ్య చర్చ అనివార్యం అని మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు తెలిపారు.