పాక్ డ్రోన్లను కూల్చింది ఆ మిస్సైలే.. భారత ఆర్మీ కీలక ప్రకటన

by Shiva |
పాక్ డ్రోన్లను కూల్చింది ఆ మిస్సైలే.. భారత ఆర్మీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌ సైన్యం నిర్ధాక్షిణ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి జమ్మూకశ్మీర్‌లో పౌరులు, మిలటరీ వాహనాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. గురువారం రాత్రి LOCతో పాటు భారత భూభాగంలోని ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ పాక్ ప్రయోగించిన మొత్తం 50 డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే కూల్చేసింది. L70 గన్స్‌, ZU-23 MM, అధునాతన ఆయుధాలతో వాటిని నాశనం చేసింది. అయితే, ప్రధానంగా డ్రోన్లను విధ్వంసం చేయడంలో సైన్యం ఆకాశ్ మిస్సైల్‌ను సంధించింది. ఆ క్షిపణి పాక్ డ్రోన్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పని చేసింది. పాక్ దాడిని పసిగట్టిన భద్రతా బలగాలు సరిహద్దుల్లో ఆకాశ్ మిస్సైల్స్‌ను సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించింది. భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించిన ఆకాశ్ భూమి మీద నుంచి నేరుగా మల్టిపుల్ లక్ష్యాలను మీడియం రేంజ్‌లో ఛేదించింది. రియల్ టైమ్ దాడులను వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ్ మిస్సైల్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది.



Next Story

Most Viewed