Operation Sindoor : నాగ్రోటలో ఉగ్రదాడులు.. ఫేక్ వార్తలన్న రక్షణశాఖ

by M.Rajitha |
Operation Sindoor : నాగ్రోటలో ఉగ్రదాడులు.. ఫేక్ వార్తలన్న రక్షణశాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో మరో ఉగ్రదాడి(Terror Attack) జరిగిందన్న వార్తలు సంచలనం రేపాయి. జమ్ములోని నాగ్రోట(Nagrota)లో గల సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు దిగారని.. ఈ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొందని వార్తలు వచ్చాయి. ఈ దాడుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం అయినట్టుగా కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే దీనిపై భారత రక్షణశాఖ(Indian Defence)స్పందించింది. నాగ్రోటపై ఎలాంటి దాడి జరగలేదని, అవన్నీ ఫేక్ వార్తలని(Nagrota Fake News)కొట్టి పారేసింది.

ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు దాడులు చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరింది. అయితే దీనిపై మరింత సమాచారణ తెలియాల్సి ఉంది. గత మూడు రోజులుగా భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం(India Pakistan War)జరగగా.. నేడు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందని సమాచారం.



Next Story

Most Viewed