India-Pakistan war: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా రద్దు!

by D.Reddy |
India-Pakistan war: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా రద్దు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) అనంతరం భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భక్తుల (Devotees) భద్రతా దృష్ట్యా చార్‌ధామ్ (Chardham) యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్ధు ప్రాంతాల్లో భీకర దాడులు జరుగుతోంది. ఈ సమయంలో చార్‌ధామ్‌ యాత్రను నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ నిలిపేయాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది.

అయితే, పాకిస్థాన్‌ హిందూ దేవాలయాలను టార్గెట్‌ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్‌ధామ్‌ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు మోహరించారు. అలాగే, యాత్రకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకు చార్‌ధామ్ యాత్రను ప్లాన్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు నాలుగున్నర లక్షల మంది యాత్రికులు సందర్శించారు. అయితే యుద్ధం కారణంగా ఈ ఏడాది యాత్ర సాగుతుందా? లేదా? అనే సందిగ్ధం సర్వత్రా నెలకొంది.



Next Story

Most Viewed