- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాసేపట్లో CDS, త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

దిశ, వెబ్డెస్క్: పాక్ భూభాగంలోకి వెళ్లి భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల మోత Latest News, Telugu News, Operation Sindoor Effect, India, Pakistan, Drones, Missiles, Jammu Kashmir, Indian Army, Indian Airforceమోగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేసి.. పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవాళ ఢిల్లీలో కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడలు చేస్తున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే అంశాలపై చర్చించనున్నారు. ఒడిశాలోని కీలకమైన రక్షణ స్థావరాలైన చాందీపూర్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) చుట్టూ హై సెక్యూరిటీ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అదేవిధంగా పాకిస్థాన్ షెల్లింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్నాథ్ ఆరా తీయనున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఒడిశాలో మధ్యాహ్నం 2 గంటలకు తూర్పు శ్రేణి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) డాక్టర్ సత్యజిత్ నాయక్ అధ్యక్షతన అత్యవసర సంసిద్ధత సమావేశం జరగనుంది. సెన్సిటివ్ మిస్సైల్స్, వెపన్ టెస్టింగ్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్న రెండు కీలకమైన రక్షణ స్థావరాలు చాందీపూర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR), ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ (PXE) వద్ద భద్రతా ప్రోటోకాల్పై ఆ భేటీలో చర్చించనున్నారు.