ఇండియా దెబ్బ అదుర్స్...అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్!

by Veldandi saikiran |
ఇండియా దెబ్బ అదుర్స్...అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా దెబ్బకు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విమానాలు రద్దు చేసుకుంది పాక్. ఇండియాతో ( India) అనవసరంగా పెట్టుకున్న పాకిస్తాన్ ( Pakistha).. ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. శుక్రవారం ఇండియాలోనే 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. అయితే ఇండియా వాటిని అడ్డుకుంది. సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు కూడా చేస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో భారత్ దాడికి పాల్పడింది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ లో పేలుళ్లు జరిపింది ఇండియా.

పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేస్తోంది. రావాల్పిండి ( Rawalpindi), లాహోర్ ( Lahore), ఇస్లామాబాద్ లో ( Islamabad) పేలుళ్లు జరిపింది... నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ( Air Base) సమీపంలో భారీ పేలుళ్లు కూడా భారత్ జరిపింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసింది. ఇక భారత్ దాడితో పాక్ ఎయిర్ స్పేస్ మూసివేసారని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్...ఈ మేరకు ప్రకటన చేసింది. అటు మూడు ఎయిర్ బేస్ లపై దాడులు జరిగినట్టు ప్రకటించింది పాక్ ఆర్మీ. ఇవాళ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య అన్ని రకాల విమానాలను రద్దు చేసింది.

ఇండియా దెబ్బ అదుర్స్...అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్



Next Story