- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మళ్లీ కెలుకుతున్న పాకిస్తాన్.. ఆ ప్రాంతంలో కాల్పులమోత.. నిన్నటి డోస్ సరిపోలేదా?

దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్(Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని చూపుతోంది. మరోసారి భారత్(India)పై కాల్పులకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్(Uri Sector)లో కాల్పులమోత మోగిస్తున్నారు. పాక్ దాడులను ముందే గ్రహించిన భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరీలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతలతో పాటు ముఖ్యమైన సంస్థల దగ్గర ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలైన ఇండియా గేట్, కుతుబ్ మినార్, ఎర్రకోట దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనితో పాటు, ఢిల్లీ పోలీసులు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, దౌత్యకార్యాలయ దగ్గర కూడా భద్రతను పెంచారు. మరోవైపు ఉగ్రవాదులకే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.