- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉద్రిక్తతల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం.. పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్ల సందర్శన

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల (India and Pakistan borders) మధ్య ఉద్రిక్తతల వేళ.. జమ్మూ కాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. (Operation Sindoor) ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్పై డ్రోన్ దాడులు, కాల్పులతో పాక్ తిరగబడుతున్న (Pakistan attack) విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం సందర్శించారు. గత రెండు రోజుల నుంచే సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను జమ్మూ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలకు షెల్టర్లతో పాటు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగారు. స్థానికులతో చర్చిస్తూ వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తున్నారు.
మరోవైపు నిన్న పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్కుమార్ థప్పా (Rajkumar Thappa) ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్కుమార్ మృతి చెందారని, నిబద్ధత కలిగిన ఆఫీసర్ను కోల్పోయామని తెలిపారు.
ఒక రోజు ముందే తనతో ఆన్లైన్ సమావేశంలో రాజ్కుమార్ పాల్గొన్నారని, ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించేందుకు మాటలు కూడా రావడం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్స్, కాల్పులు, ఫిరంగులతో విరుచుకుపడుతోంది. అందుకు భారత్ సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.