పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయదని యూఎస్ హామీ ఇస్తుందా: ఓవైసీ

by Ajay kumar |
పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయదని యూఎస్ హామీ ఇస్తుందా: ఓవైసీ
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి స‌పోర్ట్ చేయ‌ద‌ని అమెరికా గ్యారెంటీ ఇస్తుందా అని ఎంఐఎం అధిన‌నేత అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. విదేశీ అధ్య‌క్షుడి జోక్యం కంటే ముందే ప్ర‌ధాని మోడీ కాల్పుల‌ను విర‌మించుకున్నా బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి ఓవైసీ పలు ప్ర‌శ్న‌లు వేశారు. 1972 నుండి మ‌న వ్య‌వహారాల్లో మూడో వ్య‌క్తి జోక్యాన్ని నిరాక‌రిస్తున్నామ‌ని గుర్తు చేశారు.

మ‌రి ఇప్పుడు ఎందుకు అంగీక‌రించాము అని ప్ర‌శ్నించారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాద దాడులు చేయ‌కుండా మ‌నం అనుకున్న లక్ష్యాల‌ను చేదించ‌గ‌ల‌మా అని నిల‌దీశారు. ఇదిలా ఉంటే భార‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని చాలా మంది పౌరులు, ప్ర‌ముఖులు విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే యుద్దం మొద‌లు పెట్టిన త‌ర‌వాత ఎందుకు ఆపాల‌ని అంటున్నారు. యుద్దం ద్వారా భార‌త‌దేశానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సరిహ‌ద్దుల్లో కొంద‌రు సైనికుల‌తో పాటూ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని కొంద‌రు ప్ర‌జ‌ల‌ను కోల్పోయామ‌ని మండిప‌డుతున్నారు.



Next Story