- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
నేను మళ్లీ సైన్యంలో చేరడానికి సిద్ధం.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన

దిశ, వెబ్డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన వేళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తాను 16 ఏళ్లకే సైన్యంలో చేరానని గుర్తుచేశారు. మిగ్ 21 ఫైటర్ జెట్ పైలట్గా పనిచేశానని చెప్పుకొచ్చారు. భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోన్న వేళ మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే మరోసారి సైన్యంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాదు.. పీవోకేను భారత్ సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అన్నారు. పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాదులే ఆ దేశానికి సంకటంగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ రెండు అవ్వడం ఖాయంగా కనిపిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు.