ఎక్కడికక్కడ అన్నీ ఆపేయడానికి మేము సిద్ధం.. పాకిస్తాన్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
ఎక్కడికక్కడ అన్నీ ఆపేయడానికి మేము సిద్ధం.. పాకిస్తాన్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి(Pakistan's Foreign Minister) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు తగ్గింపునకు తాము సిద్ధమని ప్రకటించారు. భారత్‌ దాడులు చేయడం ఆపితే.. తామూ ఆపేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము అమెరికాకు చెప్పామని వెల్లడించారు. మరోవైపు.. సరిహద్దుల్లో పాక్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని భారత సైన్యం పేర్కొంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ ఖాసా కంటోన్మెంట్‌పై పాక్ డ్రోన్ దాడులు ప్రయోగిస్తోందని వెల్లడించింది. పాక్ డ్రోన్లను వచ్చినవి వచ్చినట్లు సమర్థవంతంగా కూల్చివేసినట్లు తెలిపారు. పాక్ తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోందని.. సాధారణ పౌరులపై దాడులకు తెగబడుతోందని.. ఇది సరైన పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చింది.

ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీకి భారత సైన్యం సవాల్ చేసింది. ఇదిలా ఉండగా.. భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పాక్ డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే దాయాదికి ఇండియన్ ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది. అందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో పాక్‌పై ప్రతిదాడికి దిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కేంద్రమైన రావల్పిండిని లక్ష్యంగా చేసుకుని భారత్ బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ను భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed