కాసేపట్లో యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. అసలు విషయం ఇదే!

by Shiva |
కాసేపట్లో యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కౌంటర్ అటాక్‌గా పాక్‌పై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైంది. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన పాక్ భద్రతా బలగాలు ఉత్తర కాశ్మీర్‌లోని యూరీ, కుప్వారా సరిహద్దు ప్రాంతాల్లోని జనవాసాలపై, భారత పోస్టులపై నిరంతరం షెల్లింగ్ చేస్తోంది. గురువారం రాత్రి దాయాది పాక్ జమ్మూకశ్మీర్, పంజాబ్ ఇంకా రాజస్థాన్‌లోని పలు సరిహద్దు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో కాల్పులు జరిపింది. అదేవిధంగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లలో బాంబుల వర్షం కురిపించింది.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి పాక్ కాల్పులకు తెగబడిన యూరీకి ప్రాంతానికి కాసేపట్లో జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా వెళ్లనున్నారు. నిరంతరాయంగా పత్యర్థి కాల్పులను సమర్ధవంతంగా తిప్పకొడుతున్న భద్రతా బలగాలను ఎల్జీ ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి సమీప ప్రజల బాగోగులు, ప్రాణ నష్టంపై ఆరా తీయనున్నట్లుగా తెలుస్తోంది.



Next Story

Most Viewed