Indian Railways: మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే!

by Shamantha N |
Indian Railways: మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా జమ్ము, ఉధంపూర్ నుండి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా.. గురువారం రాత్రి మిస్సైల్స్, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి పాక్ ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపైకి వాటిని వదిలింది. జమ్ము, ఉధంపుర్, అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్‌ లక్ష్యంగా పాక్‌ ఈ డ్రోన్లను ప్రయోగించింది. జమ్ము విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్‌ జెట్లను కూల్చేసింది. పాక్‌ పైలట్‌ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. అంతేకాకుండా, సత్వారా, సాంబా, ఆర్‌ఎస్‌ పురాల్లో క్షిపణి దాడులకు పాక్‌ ప్రయత్నించింది.



Next Story

Most Viewed