- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో పాక్ లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL)పై పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. PSL వేదికను పాక్ నుంచి దుబాయ్(UAE)కి మారుస్తున్నట్టు PCB వెల్లడించింది. మరోవైపు ఇండియాలో జరుగుతున్న IPL మ్యాచుల విషయంలో కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచులను ఇతర దేశాల్లో నిర్వహించాలని చూస్తున్నట్టు సమాచారం.
పహాల్గం ఉగ్రదాడి(Pahalgam Terror Attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాక్ పై ప్రతిదాడికి దిగింది. పాక్ కీలక నగరాలైన ఇస్లామాబాద్(Islamabad), లాహోర్(Lahor) పై వైమానిక దాడులు, మిస్సైల్స్ తో విరుచుకు పడింది. కరాచీ పోర్టు(Karachi Port)ను పూర్తిగా ధ్వంసం చేసింది.






