- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కన్నీళ్లు పెట్టిన మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ.. కీలక వ్యాఖ్యలు
by Shiva |

X
దిశ, వెబ్డెస్క్: ఆపరేషన్ సందూర్తో భారత్, పాక్ పరస్పరం సైనిక చర్యకు దిగాయి. ఈ క్రమంలోనే పాక్ సేనలు జమ్మూని టార్గెట్గా చేసుకుని గురవారం డ్రోన్, మిస్సైల్ దాడులకు పాల్పడింది. మహిళలు, పిల్లలు కాల్పుల్లో చనిపోతుండటంతో జమ్ముూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కన్నీళ్లు పెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జమ్మూ నుంచ తన మనసులు కలచివేసే వార్తలు వింటున్నానని అన్నారు. సరిహద్దుల వెంట నివసిస్తున్న వారి పరిస్థితిని ఊహించుకుంటేనే తన హృదయం విలపిస్తోంది, వారు మరోసారి భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారని అన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో వారి భద్రత, బలం కోసం ప్రార్థనలు చేస్తానని తెలిపారు. పరస్పర దాడులతో ఇప్పటికే చాలామంది జీవితాలు దెబ్బతిన్నాయని మెహబుబా ముఫ్తీ పేర్కొన్నారు.
Next Story