DRDO: ఇండియన్ ఆర్మీకి గుడ్ న్యూస్.. మిలటరీ మిషన్స్ కోసం త్వరలో హ్యూమనాయిడ్ రోబో

by Prasad Jukanti |
DRDO: ఇండియన్ ఆర్మీకి గుడ్ న్యూస్.. మిలటరీ మిషన్స్ కోసం  త్వరలో హ్యూమనాయిడ్ రోబో
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్- పాక్ మధ్య పరిస్థితి పూట పూటకు మారుతోంది. పాక్ చేస్తున్న దాడులను భారత సైన్యం తిప్పి కొడుతోంది. సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ((DRDO)) శనివారం కీలక ప్రకటన చేసింది. ఫ్రంట్ లైన్ సైనిక మిషన్ లో భాగం కాగల వ్యూమనాయిడ్ రోబోపై (HUMANOID ROBOT) డీఆర్ డీవో పని చేస్తోందని ఆ సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద కర పరిస్థితుల్లో భద్రతా దళాలు బహిర్గతం కాకుండా మానవ ఆదేశాలతో టార్గెట్ పూర్తి చేసేలా ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ ప్రయోగంలో కీలకమైన ఇంజనీర్ ఒకరు తెలిపారు. ఈ రోబోట్ ను ఇటీవల పూణేలో జరిగిన నేషనల్ వర్క్‌షాప్ ఆన్ అడ్వాన్స్‌డ్ లెగ్డ్ రోబోటిక్స్‌లో ప్రదర్శించారని అంతర్గతగా నిర్వహించిన కొన్ని పరీక్షల్లో ఈ రోబో ఇప్పటికే విజయం సాధించినట్లు చెప్పారు. అటవి వంటి కఠినమైన భూభాగాలపై సమర్థవంతంగా పని చేసేలా ఈ రోబో రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని ఆపరేటర్ ఆదేశాలను అర్థం చేసుకుని అమలు చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై శాస్త్రవేత్తల బృందం పని చేస్తున్నారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పరిశోధకులు సాగుతున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed