- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
DRDO: ఇండియన్ ఆర్మీకి గుడ్ న్యూస్.. మిలటరీ మిషన్స్ కోసం త్వరలో హ్యూమనాయిడ్ రోబో

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్- పాక్ మధ్య పరిస్థితి పూట పూటకు మారుతోంది. పాక్ చేస్తున్న దాడులను భారత సైన్యం తిప్పి కొడుతోంది. సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ((DRDO)) శనివారం కీలక ప్రకటన చేసింది. ఫ్రంట్ లైన్ సైనిక మిషన్ లో భాగం కాగల వ్యూమనాయిడ్ రోబోపై (HUMANOID ROBOT) డీఆర్ డీవో పని చేస్తోందని ఆ సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద కర పరిస్థితుల్లో భద్రతా దళాలు బహిర్గతం కాకుండా మానవ ఆదేశాలతో టార్గెట్ పూర్తి చేసేలా ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ ప్రయోగంలో కీలకమైన ఇంజనీర్ ఒకరు తెలిపారు. ఈ రోబోట్ ను ఇటీవల పూణేలో జరిగిన నేషనల్ వర్క్షాప్ ఆన్ అడ్వాన్స్డ్ లెగ్డ్ రోబోటిక్స్లో ప్రదర్శించారని అంతర్గతగా నిర్వహించిన కొన్ని పరీక్షల్లో ఈ రోబో ఇప్పటికే విజయం సాధించినట్లు చెప్పారు. అటవి వంటి కఠినమైన భూభాగాలపై సమర్థవంతంగా పని చేసేలా ఈ రోబో రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని ఆపరేటర్ ఆదేశాలను అర్థం చేసుకుని అమలు చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై శాస్త్రవేత్తల బృందం పని చేస్తున్నారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పరిశోధకులు సాగుతున్నట్లు చెప్పారు.