జమ్మూకాశ్మీర్‌లో పాక్ దాడులు.. పూర్తిగా ధ్వంసమైన పౌరుల ఇళ్లు

by srinivas |
జమ్మూకాశ్మీర్‌లో పాక్ దాడులు.. పూర్తిగా ధ్వంసమైన పౌరుల ఇళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్(Pakistan) ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)పై డ్రోన్ల(Drones)తో దాడులకు పాల్పడుతోంది. దీంతో ఎల్‌ఓసి వెంబడి గ్రామాల్లో ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాలపై పాకిస్థాన్ సైన్యం చేసిన ఆపరేషన్‌ను భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. 50కి పైగా డ్రోన్‌లను కూల్చివేసింది. అయితే కొన్ని చోట్ల పౌరుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నిన్నటి వరకూ అందంగా కనిపించిన ఇళ్లు.. ఇప్పుడు దెబ్బతిన్న గోడలు, విరిగిన కిటికీలు, నేలపై శిథిలాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు అందవిహీనంగా మారిపోవడంతో అక్కడి పౌరులు ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed