- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యుద్ధ క్షేత్రంలోకి క్రికెటర్లు, హీరోలు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ అధికారాలను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీలోని అందరు అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలవడానికి అధికారం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఈ టెరిటోరియల్ ఆర్మీలో చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, మళయాలం యాక్టర్ మోహన్ లాల్, నానా పటేకర్ తదితరులు ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీ విధులు ఏంటి? యుద్ధంలో వీరి పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ను ఓపెన్ చేసి చూడండి.
హైదరాబాద్లో అందాలు ఉట్టిపడేనా.. లేక కట్టిపడేసి ఫ్లైట్ ఎక్కించేనా..?
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్వరల్డ్ పోటీలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. రేపటి నుంచి ఈనెల 31 వరకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహక సంస్థ, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ -2025 మ్యాచ్లను బీసీసీఐ వాయిదా వేయడంతో మిస్వరల్డ్ పోటీలు జరిగేనా? అనే సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ దారిలోనే మిస్వరల్డ్ నిర్వాహకులు కొన్నిరోజుల వరకు వాయిదా వేస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వార్తను చూడాల్సిందే.
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్స్
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. కంట్రోల్ రూమ్లలో టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఏపీ, తెలంగాణ నివాసితులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని అధికారులు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ప్రభుత్వాలు ప్రకటించిన నంబర్లు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.