జైసల్మేర్‌లో నాలుగు సార్లు పేలుడు శబ్దాలు!

by Ajay kumar |
జైసల్మేర్‌లో నాలుగు సార్లు పేలుడు శబ్దాలు!
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ త‌న నీచ‌బుద్ధిని చూపిస్తోంది. అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో కాల్పుల విర‌మ‌ణ చేసుకుంటున్న‌ట్టు రెండు దేశాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.అమెరికా ప్ర‌ధాని ట్రంప్ కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్వీట్ కూడా చేశారు. అది జ‌రిగిన కొద్దిసేప‌టికే పాకిస్థాన్ భార‌త్ లోని ప‌లు ప్రాంతాల్లో మ‌ళ్లీ డ్రోన్ల‌తో దాడికి య‌త్నించింది.

జ‌మ్మూక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో కాల్పులు జ‌ర‌ప‌డంతో పాటూ ఏడుగురు తీవ్ర‌వాదులు చొర‌బాటుకు య‌త్నించిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం అక్క‌డ ఆర్మీ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తోంది. మ‌రోవైపు రాజ‌స్థాన్ లోని జైస‌ల్మేర్ లోనూ నాలుగు సార్లు పేలుడు శ‌బ్దాలు వినిపించిన‌ట్టు స‌మాచారం. దీంతో మ‌ళ్లీ స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టే భార‌త ఆర్మీ సైతం అల‌ర్ట్ అయింది. ర‌క్ష‌ణ‌శాఖ ఆర్మీకి ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చింది.



Next Story

Most Viewed