- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
India: అఫ్గాన్ పౌరులకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.. పాకే ఫేక్ న్యూస్ పై కేంద్రం స్పందన

దిశ, నేషనల్ బ్యూరో: ఫేక్ న్యూస్ ద్వారా భారతదేశంలో మత విద్వేషాలు రేకెత్తించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. భారత ఆర్మీ మిస్సైల్స్ అఫ్గానిస్థాన్ లోనూ దాడికి కారణమయ్యాయని పాక్ ఆర్మీ కామెంట్లు చేసింది. కాగా.. ఆ వ్యాఖ్యలను హాస్యాస్పదం అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. అమృత్సర్ వైపు భారత్ మిస్సైల్స్ ప్రయోగించందనే ఫేక్ న్యూస్ ని కూడా దాయాదిదేశం వ్యాప్తి చేసిందని మీడియాతో అన్నారు. అఫ్గాన్ పై పాక్ చేస్తున్న దాడుల గురించి ప్రస్తావించారు. "ఇవి పూర్తిగా పనికిమాలిన ఆరోపణలు. గతేడాదిన్నర నుంచి తమపై దాడులు ఎవరు చేస్తున్నారనేది అఫ్గాన్కు గుర్తు చేయనవసరం లేదనుకుంటా. అనేక సందర్భాల్లో తాలిబన్ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలు, జనాభాను లక్ష్యంగా చేసుకున్న పాక్ గురించి అక్కడి ప్రజలకు బాగా తెలుసు. అఫ్గాన్ లక్ష్యంగా భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. ప్రతివిషయంలో పాక్ అసత్యప్రచారం చేస్తోంది" అని మిస్రీ అన్నారు. పౌరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న ఒత్తిడిలో భారత ప్రభుత్వం ఉందని చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.