Breaking: అమృత్‌స‌ర్‌లో నాలుగు చోట్ల పేలుళ్లు

by Ajay kumar |
Breaking: అమృత్‌స‌ర్‌లో నాలుగు చోట్ల పేలుళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మ‌రోసారి భార‌త్ పై దాడుల‌కు తెగ‌బ‌డింది. సాయంత్రం వ‌ర‌కు సరిహ‌ద్దులు ప్ర‌శాంతంగా ఉండ‌గా చీక‌టిప‌డ‌గానే మ‌రోసారి దాడులు మొద‌లుపెట్టింది. తాజాగా పాకిస్థాన్ మ‌రోసారి భార‌త్ పై దాడుల‌కు తెగ‌బ‌డింది. సాయంత్రం వ‌ర‌కు సరిహ‌ద్దులు ప్ర‌శాంతంగా ఉండ‌గా చీక‌టిప‌డ‌గానే మ‌రోసారి దాడులు మొద‌లుపెట్టింది. పంజాబ్ లోని అమృత్‌సర్‌లో నాలుగు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమృత్‌సర్‌లో బ్లాక్ విధించారు. మ‌రోవైపు నిన్న కూడా అమృత్‌సర్‌లో పాకిస్థాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. కానీ వాటిని ఇండియన్ ఆర్మీ సమదర్థవంతంగా తిప్పికొట్టింది. నేడు కశ్మీర్‌తో పాటూ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కశ్మీర్‌లో పేలుళ్లు శబ్దాలు తనకు వినిపించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఒమర్ అబ్దుల్లా అక్కడి ప్రజలను అలర్ట్ చేశారు. ఈ దాడులను భారత సైన్యం అడ్డుకుంటుంది.



Next Story

Most Viewed