పాక్ వెనుక టర్కీ... ఇండియన్స్ డబ్బులతో బతుకుతూ కుట్రలు!

by Veldandi saikiran |
పాక్ వెనుక టర్కీ... ఇండియన్స్ డబ్బులతో బతుకుతూ కుట్రలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. టర్కీ ( Turkey) కుట్రలు బయటపడ్డాయి. మన ఇండియన్ యాత్రికుల డబ్బులతో బతుకుతున్న టర్కీ.. ఇండియా పై కొత్త కుట్రలకు తెరలైపోయింది. పాకిస్తాన్ ( Pakisthan) దేశానికి డ్రోన్స్ ( Drones) సప్లై చేసి... అడ్డంగా బుక్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) యుద్ధం నేపథ్యంలో... పాకిస్తాన్ కు ఏ ఒక్క దేశం సహాయం చేయడం లేదు.

కానీ టర్కీ మాత్రం డ్రోన్స్ సప్లై చేసి ఇండియా పై.. యుద్ధానికి పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తోంది. కానీ.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. టర్కీ దేశం బతికేది మొత్తం మన ఇండియన్స్ పైనే అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. టర్కీ ఓ పర్యాటక దేశం. ఈ దేశానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియన్ నుంచి చాలామంది వెళ్తారు.

2024 ఒక్క సంవత్సరంలోనే... ఇండియా నుంచి టర్కీ కి రెండు లక్షల 65,000 మంది వెళ్లారు. వీళ్ళందరూ యాత్రికులే. వీళ్ళ డబ్బులు ద్వారా.. టర్కీ ఆదాయం అమాంతం పెరిగింది. 2023 కంటే.. 2024 సంవత్సరంలో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 34 శాతం.. యాత్రికులు 2024లో టర్కీని సందర్శించారు. అంటే టర్కీ... దేశాన్ని బతికించేది మన ఇండియన్స్. కానీ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా శత్రు దేశమైన పాకిస్తాన్ కు టర్కీ సహాయం చేస్తుంది. ఈ విషయం బయటకు రావడంతో టర్కీ దేశం పై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed