ఓటీటీలోకి రాబోతున్న శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ అధికారిక ప్రకటన విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
ఓటీటీలోకి రాబోతున్న శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ అధికారిక ప్రకటన విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, శ్రీహర్ష కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. రూ. 10 కోట్ల కలెక్షన్లు రాబట్టినప్పటికీ ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది.

తాజాగా, ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీనిపై అధికారిక ప్రకటనను ట్విట్టర్ వేదికగా వారు తెలిపారు. అయితే ఓం భీమ్ బుష్ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. థియేటర్స్‌లో మిస్ అయిన ఆడియన్స్ ఓం భీమ్ బుష్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.. చూసి ఎంజాయ్ చేద్దామా అని సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed