ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ‘తుపాకుల గూడెం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ‘తుపాకుల గూడెం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: జైదీప్ విష్ణు డైరెక్షన్‌లో గత ఏడాది వచ్చిన చిత్రం తుపాకుల గూడెం. ఇందులో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్ జయేత్రి, వినీత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 3న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, తుపాకుల గూడెం డిజిటల్ స్ట్రీమింగ్ మక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.

ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతొంది. అయితే ఈ సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్ డ్రాప్‌తో ఉన్నట్లు సమాచారం. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే దానిపై కథ తిరుగుతుందట. కాగా ఈ సినిమా దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Next Story

Most Viewed