డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతున్న కీర్తీ సురేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

by Disha Web Desk 6 |
డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతున్న కీర్తీ సురేష్  మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా సైరన్. దీనిని ఆంటోని భాగ్యరాజ్ దెరకెక్కించగా.. ఫిబ్రవరి 16న మలయాళంలో విడుదలైంది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. అయితే సైరన్ మూవీని తెలుగులో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక సైరన్ తెలుగు రిలీజ్ ఆపేసినట్లు తెలుస్తోంది.

దీంతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించి సినీ ప్రియులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19 నుంచి సైరన్ 5 భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం.



Next Story