ఓటీటీలోకి రాబోతున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 6 |
ఓటీటీలోకి రాబోతున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో నటుడిగా, హీరోగా నటించి సుహాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సుహాస్ ఇటీవల నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. దీనిని డైరెక్టర్ దుష్యంత్ కటికినేని తెరకెక్కించగా.. మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

అయితే ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో విడుదలై విజయం అందుకుంది. అంతేకాకుండా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టి లాభాల బాట పట్టింది. ఇక ఇప్పుడు తాజాగా, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ఈ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అలాగే సుహాస్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు.

Next Story

Most Viewed