ఓటీటీలోకి రాబోతున్న ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
ఓటీటీలోకి రాబోతున్న ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలర్ ఫొటో సినిమాతో ఫుల్ పాపులారిటీ పెంచుకున్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇటీవల సుహాస్, శివాని కలిసి జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’. దీనిని డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించగా.. ఫిదా నటి శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి రెస్పా్న్స్‌ను రాబట్టింది. తాజాగా, ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ పోస్ట్ పెట్టారు. మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి’’ త్వరలో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ స్ట్రీమింగ్ అవుతోంది అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమా మార్చి 1న ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed