ఆలియా భట్ నిర్మించిన మొదటి క్రైమ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

by Disha Web Desk 6 |
ఆలియా భట్ నిర్మించిన మొదటి క్రైమ్ సిరీస్  ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. ఆలియా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూనే ఒక పక్క పలు యాడ్స్ చేస్తుంది. తాజాగా, ఈ అమ్మడు నిర్మాతగా ‘పోచర్’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఆస్కార్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటన్‌మెంట్ నిర్మించగా.. మరో నిర్మాతగా ఆలియా వ్యవహరించిందట. దీనికి మెమతా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఇందులో నటించారు. తాజాగా, ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడి అయినట్లు సమాచారం. ‘పోచర్’ ఫిబ్రవరి 23న అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. అమెజాన్ ప్రైమ్ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Next Story

Most Viewed