ఓటీటీలో భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ సినిమా.. ఎన్ని కోట్లంటే?

by Disha Web Desk 6 |
ఓటీటీలో భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ సినిమా.. ఎన్ని కోట్లంటే?
X

దిశ, సినిమా: తమిళ సూపర్ అజిత్ కుమార్, త్రిష, రెజీనా కాంబోలో రాబోతున్న సినిమా ‘విదా ముయార్చి’. ప్రతిష్టాత్మక బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి ముగిజ్ తిరుమెని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 100 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.

తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనిపై లైకా ప్రొడక్షన్స్ వారు స్పందిస్తూ.. ‘‘సినిమా పరిశ్రమలో అజిత్ ఒక్కడే ఎలక్ట్రిఫైయింగ్ అనుభూతిని కలిగిస్తాడు. విదా ముయార్చి త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని’’ రాసుకొచ్చారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించకపోవడంతో అజిత్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.

Next Story