ఏకంగా 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Disha Web Desk 6 |
ఏకంగా 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సంజయ్ లిలా బన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘బ్లాక్’. ఈ సినిమా 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు, ఆయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, ధృతిమాన్ ఛటర్జీ సహాయక పాత్రల్లో నటించారు. అమితాబ్, టీచర్ పాత్రలో నటించగా.. రాణి ముఖర్జీ స్టూడెంట్‌గా నటించి ఎంతో మంది మనసులను గెలుచుకున్నారు. దీనికి మూడు జాతీయ అవార్డులు కూడా వచ్చాయట.

అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా చూద్దామా అని ఎదురుచూసినప్పటికీ లాభం లేకుండా పోయింది. తాజాగా, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. నేటి నుంచి బ్లాక్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు వెల్లడించారు. ఏకంగా 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు సంతోష పడుతున్నారు.

Next Story

Most Viewed