‘తొలి దశ’కు నేడే నోటిఫికేషన్.. 27వరకు నామినేషన్ల స్వీకరణ

by Dishanational5 |
‘తొలి దశ’కు నేడే నోటిఫికేషన్..  27వరకు నామినేషన్ల స్వీకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల సందడి మొదలుకానుంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. వీటి దాఖలుకు ఈ నెల 27 ఆఖరి తేది. 28న పరిశీలన ఉంటుంది. 30వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తుంది.

తమిళనాడులో సింగిల్ ఫేజ్..

వచ్చే నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌కు నిర్వహించనున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. తమిళనాడు తర్వాత రాజస్థాన్‌లో అత్యధికంగా 12 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశలో భాగంగా 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటు మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోని చెరో 5 స్థానాలు, బిహార్‌లో 4, బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి నియోజకవర్గాలు, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఒక్కో లోక్‌సభ స్థానంలో పోలింగ్ జరగనుంది.

లోక్‌సభ ‘తొలి దశ’ షెడ్యూల్

నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి

నామినేషన్ల పరిశీలన: 28 మార్చి

ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి

పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19



Next Story

Most Viewed