- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నల్లగొండలో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. BJP MP అభ్యర్థి ప్రకటన
దిశ, వెబ్డెస్క్: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. నల్లగొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ.. కాంగ్రెస్కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. జిల్లా బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా.. తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏంటో ప్రజలు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి.. ఇప్పుడు చేతులు ఎత్తేశారని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోందని అన్నారు. గతానికి భిన్నంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకోబోతోందని చెప్పారు.