రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే కష్టాలు తీరుతాయి: మంత్రి సీతక్క

by GSrikanth |
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే కష్టాలు తీరుతాయి: మంత్రి సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే అందరి కష్టాలు తీరుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు బీజేపీ కట్టబెట్టిందని విమర్శించారు. సింగరేణిని ప్రయివేటీకరణ చేశారని చెప్పారు. మరోవైపు అధికారం కోల్పోగానే కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక ఎవరినో ఉద్దరిస్తానని బయలుదేరారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులను డైవర్ట్ చేసేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమంగా కనుమరుగు కావడం ఖాయమన్నారు.

Next Story

Most Viewed